మహబూబాబాద్ : నిన్న మహబూబాబాద్ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ ప్రజా పాలన సభ అట్టర్ ప్లాప్ అయింది. ఆరుగురు మంత్రులు వచ్చి ఆర్భాటం చేశారు తప్పా అభివృద్ధికి కోసం చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభలో బీఆర్ఎస్ నేతలపై విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ పాలనలో అభివృద్ధి మీద చర్చకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమా? అని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరు నెలల కింద కురవి మండలం వద్ద శంకుస్థాపన చేసిన పని ఇంకా ప్రారంభం కూడా కాలేదన్నారు. చెరువుల్లో చుక్క నీరు లేక కట్టలు తెగి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
భట్టి విక్రమార్క తన స్థాయిని మించి మాట్లాడుతున్నాడు. పంచెలు కట్టినంత మాత్రాన రైతులు అవుతారా? అని నిలాదీశారు. ఇందిరమ్మ ఇండ్లకు ఒక్క రూపాయి అయిన చెల్లించారా.. భూభారతి ద్వారా ఒక్క ఎకరం భూమి సమస్య అయిన పరిష్కారం చేసావా అని మంత్రి పొగుంలేటిని నిలదీశారు. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ చేసిన దాంట్లో10 శాతం అయినా అభివృద్ధి పనులు చేయాలని సవాల్ విసిరారు. ఒక్క మహిళ అయినా కాంగ్రెస్ 18 నెలల పాలనలో కోటీశ్వరురాలు అయ్యిందా? ఒక్క సారి మంత్రి సీతక్క ఆ మహిళను చూపెట్టాలన్నారు. సీతక్క మంత్రి స్థాయిలో ఉండి శాపనార్థాలు పెడుతుంది, నెత్తిన మూటలు మోసి ప్రజలను మోసం చేస్తున్నావు అని విమర్శించారు.