హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. సాయిచంద్ మరణాన్ని తట్టుకోలేక రోదిస్తున్న ఆయన భార్య రజిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
సోమవారం సాయంత్రం గుండెనొప్పి రావడంతో వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించినట్టు బంధువులు తెలిపారు. బీఎన్ రెడ్డినగర్లోని కోణార్క్ డయాగ్నస్టిక్ సెంటర్లో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు గుర్రంగూడలోని ఓ దవాఖానకు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతున్నట్టు సమాచారం.