హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రద్దు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత పరీక్షలపై ప్రకటన చేస్తామని చెప్పారు. మంత్రి సబిత బుధవారం వికారాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రద్దు చేశారా అని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి వివరణ ఇచ్చారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేసిన విషయం విదితమే.