హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): వానకాలం పంట పెట్టుబడి కోసం రైతులకు రైతుబంధు పంపిణీ పూర్తయిం ది. ఈ నెల 15నుంచి ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో పంట సాయం నిధులను జమచేస్తున్న విష యం తెలిసిందే. శుక్రవారం వర కు 147.21లక్షల ఎకరాలకుగానూ 60.84లక్షల మంది ఖా తాల్లో రూ.7,360.41 కోట్లు జమచేసింది. రైతుబంధును విజయవంతంగా పంపిణీ చేయడంపై వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. బ్యాంకు ఖాతా సమస్యతో రైతుబంధు అం దని వారు ఆందోళన చెందొద్దని సూచించారు. సరైన వివరాలు అందిస్తే జమ చేస్తామన్నారు.