హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుబంధు సంబురాలను సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ రూ.50వేలకోట్ల మార్క్ను చేరుకోనున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రైతుబంధు సంబురాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ మేరకు మంత్రి ఉమ్మడి జిల్లా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. సంక్రాంతి సందర్భంగా మహిళలను భాగస్వాములను చేస్తూ, ప్రతి ఇంటి ముందు రైతుబంధు సంబంధిత ముగ్గుల పోటీలు నిర్వహించాలని, విద్యార్థులకు రైతుబంధుపై ఉపన్యాస, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు, ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపు నిర్వహించాలని మంత్రి ఉమ్మడి జిల్లా శ్రేణులకు సూచించారు. సంబురాల్లో ప్రభుత్వ జారీ చేసిన కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.