వికారాబాద్ : రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతున్నదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన చౌడా పూర్ మండల కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..చౌడపూర్ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశలో స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కృషి అభినందనీయమన్నారు.
ప్రజల ఆకాంక్షల కు అనుగుణంగా రాష్ట్రంలో జోన్లు,జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు కాగా ప్రజలకు పాలన మరింత దగ్గర అయిందని పేర్కొన్నారు. నూతనంగా 32 రెవిన్యూ డివిజన్లు, 134 మండలాలు ఏర్పడ్డాయి.
ఇటీవలి కాలంలో చివరగా పరిగి నియోజకవర్గంలోని ప్రజల అభిప్రాయం మేరకు మహమ్మదాబాద్, చౌడాపూర్ మండలాలు ఏర్పడ్డాయని తెలిపారు. 26,707 మంది జనాభా తో 14 రెవెన్యూ గ్రామలతో,మొత్తం 24 గ్రామ పంచాయతీ లతో ఏర్పడిన చౌడాపూర్ మండలంతో స్థానికుల కల నెరవేరిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా మరో 76 మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారన్నారు. వికారాబాద్ జిల్లాలో 209 నూతన గ్రామ పంచాయతీ లను ఏర్పాటు చేశామని వివరాలను వెల్లడించారు. జిల్లా ప్రజల ప్రజల కోరిక మేరకు వికారాబాద్ను చార్మినార్ జోన్లో కలిపామని గుర్తు చేశారు. త్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించాలని నిర్ణయించింది.
కలెక్టరేట్ల నిర్మాణం కోసం1700 కోట్లు బడ్జెట్ లో కేటాయించామని మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణం దాదాపు పూర్తి కావొస్తుందన్నారు. పాఠశాల అదనపు గదుల కృషి చేస్తానన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతం శశ్యశామలం అవుతుందన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పౌసమి బసు, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి ,అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పాల్గొన్నారు.
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్