హైదరాబాద్ : హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇటీవల జరిగిన 5వ ఆలిండియా మాస్టర్స్ గేమ్స్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)కు చెందిన ముగ్గురు ఉద్యోగులు సత్తా చాటారు. వీరు ఇంటర్నేషనల్ ఆసియా-పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్ కు ఎంపిక కావడం పట్ల సంస్థ ఎండీ, వీసీ సజ్జనర్
బస్ భవన్లోని తన ఛాంబర్లో బుధవారం ఉద్యోగులను అభినందించారు.
స్విమ్మింగ్ 50 మీటర్ల విభాగంలో కె.శ్రీనివాస్ రెండు గోల్డ్ పతకాలు, 100 మీటర్ల విభాగంలో ఒక సిల్వర్ పతకాన్ని సాధించారు. ఆర్చరీ 50 మీటర్ల విభాగం(మహిళ కేటగిరి)లో ఎం. అంజలి గోల్డ్ మెడల్, ఆర్చరీ 50 మీటర్ల విభాగంలో పురుషుల విభాగంలో కె. కిషన్ కంపౌండ్ బీఓడబ్ల్యూలో సిల్వర్, షూట్ ఔట్ లో బ్రాంజ్ పతకాలను సాధించారు.ఈ ఏడాది మే లో సౌత్ కొరియాలో జరిగే ఇంటర్నేషనల్ ఆసియా-పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్ కు ఈ ముగ్గురు ఎంపికయ్యారు.
ఆలిండియా మాస్టర్స్ గేమ్స్ లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటి ఆరు పతకాలు సాధించడం పట్ల సంస్థ ఎండీ ,వీసీ సజ్జనర్ హర్షం వ్యక్తం చేశారు.పతకాలు సాధించిన కె.శ్రీనివాస్, ఎం.అంజలి, కె.కిషన్లు సౌత్ కొరియాకు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కృష్ణకాంత్, స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట నారాయణ, ఫిజియో హిమన్షు కుమార్ పాల్గొన్నారు.