హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం అద్దె ప్రాతిపదికన సూపర్లగ్జరీ బస్సులను సమకూర్చేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. సుశిక్షతులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పించనున్నట్టు ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. బస్సుల్లో టీవీ సౌకర్యం ఉందని, ఇద్దరు మణికంఠ స్వాములు, మరో ఇద్దరు వంట మనుషులు, ఓ సహాయకుడు ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తుస్తామని అధికారులు తెలిపారు.
బస్సును అద్దెకు బుక్ చేసిన గురుస్వామికి ఉచిత ప్ర యాణం ఉంటుందని, ఒకటి కంటే ఎక్కువ బస్సులను బుక్ చేస్తే వారికి ఆయా బస్సులపై రోజుకు రూ.300 చొప్పున కమిషన్ కూడా ఇస్తామని తెలిపారు. శబరిమల వెళ్లే దారిలో ఇతర పుణ్యక్షేత్రాలనూ దర్శించుకునే వెసులుబాటు ఉంటుందని, వివరాలకు సమీపంలో ఆర్టీసీ అన్ని డిపోల మేనేజర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.