హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండేండ్లుగా కార్మికులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం కార్మికులను బెదిరించడం, మానసిక వేదనకు గురిచేయడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి, మాట తప్పి ఎందుకు ముఖం చాటేస్తున్నారని నిలదీశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.