Accident | కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి – భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు వాటర్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ గోపాల్కు తీవ్ర గాయాలయ్యాయి. పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాటర్ ట్యాంకర్, ఆర్టీసీ బస్సును జేసీబీ సహాయంతో రోడ్డుపై నుంచి పక్కకు తరలించారు. అనంతరం ట్రాఫిక్ను క్లియర్ చేశారు.