RS Praveen Kumar | హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి సాక్షిగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం చేస్తోందని ప్రవీణ్ కుమార్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ యాదాద్రి పర్యటనకు వెళ్లారు. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిపూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. సీఎంతోపాటు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు ఆశీర్వనం అందించారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వరుసగా అక్కడున్న పీటలపై ఆసీనులయ్యారు. ఇక భట్టి విక్రమార్క, కొండా సురేఖకు పీటలు లేకపోవడంతో నేలపైనే ఆసీనులయ్యారు. ఈ విధంగా ఎస్సీ, బీసీ కులానికి చెందిన మంత్రులకు ఘోర అవమానం ఎదురైంది.
దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం….!
ఈ అవమానాలు లేని భారతం కోసమే బీయస్పీ పోరాటం.@Bhatti_Mallu pic.twitter.com/zpSZZuBmEE
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 11, 2024