RS Praveen Kumar | హైదరాబాద్ : విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్పీ కారెక్కారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆర్ఎస్పీతో పాటు బీఎస్పీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మద్దతుదారులు, అభిమానులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, బాల్క సుమన్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.