నమస్తే తెలంగాణ, నెట్వర్క్: కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.18 కోట్ల నగదు పట్టుబడింది. పట్టుబడ్డ నగదును పోలీసులు ఆదాయపన్ను శాఖకు అప్పగించారు. ట్రై కమిషనరేట్ల పరిధిలో చేపట్టిన సోదాల్ల్లో రూ.18 కోట్ల నగదు, భారీగా బంగారు, వెండి ఆభరణాలు లభించాయి. హైదరాబాద్ నిజాం కాలేజీ వద్ద పోలీసుల తనిఖీల్లో 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుంది. చందానగర్ ఠాణా పరిధిలోని తారానగర్లో 5.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో రూ.10 లక్షలు, నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోరూ.5.40 లక్షలు, కరీంనగర్ మండలం మొగ్దుంపూరులో రూ.3 లక్షలు లభించాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, ప్రగతినగర్, మధురానగర్, బోరబండ ప్రాంతాల్లో పోలీసులు అక్రమ మద్యం సీసాలను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.