హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): దళితుల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించారు. పథ కం ద్వారా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 44 వేల ద ళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందగా, ప్రభుత్వం రూ.4,400 కోట్ల నిధులను వెచ్చించింది. తాజాగా నియోజకవర్గానికి 1,500 చొ ప్పున రాష్ట్రవ్యాప్తంగా (హుజురాబాద్ మినహా) 118 నియోజకవర్గాల్లో మొత్తంగా 1,77,000 కుటుంబాలకు దళితబంధు పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేయాలని నిర్ణయించింది.