నీలగిరి, డిసెంబర్ 25 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీటీఎస్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.14 లక్షలు చోరీ చేశారు. దుండగులు ఆదివారం తెల్లవారుజామున ఏటీఎం కేంద్రం లోకి చొరబడ్డారు. ముందుగా సీసీ కెమెరాలపై బ్లాక్ స్ప్రే చల్లారు. అనంతరం ఏటీఎం మెషిన్ను ధ్వంసం చేసి అందులోని రూ.14 లక్షలను దొంగిలించారు.
సమాచారం అందిన వెంట నే నల్లగొండ వన్ టౌన్ సీఐ రౌతు గోపి, టూ టౌన్ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్కాడ్, క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.