యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడి ఆలయ బంగారు తాపడానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం తరుపున గురువారం రూ.1,60,110 రూపాయలు అందజేశారు. గజ్వేల్ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్రావు, సభ్యుడులు జయరాంరెడ్డి, నర్సింలు, రిటైర్డ్ లెక్చరర్ తాటి లింగం తదితరులు యాదాద్రి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అధికారులకు గజ్వేల్ విశ్రాంత ఉద్యోగులంతా కలిసి తమ పింఛను నుంచి రూ.1,60,110ల మొత్తాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కన్నా గొప్పగా ఆలయాన్ని యాదగిరి లక్ష్మీనరసింహుడుకి ఆలయాన్ని నిర్మించిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు.
సీఎం కేసీఆర్ పిలుపుమేరుకు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో తాము పొలు పంచుకోవాలని నిర్ణయించుకున్నామని, అందుకే గజ్వేల్ ప్రాంత విశ్రాంత ఉద్యోగులమంతా కలిసి ఈ విరాళాన్ని అందజేసినట్లు వారు తెలిపారు.