హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగంలో మరో అడుగు ముందుకు పడింది. నర్సాపూర్, గజ్వేల్ ప్రాంతాల్లో 80 హెక్టార్ల అటవీ భూమి నుంచి ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ వెళ్లింది. ఈ భూముల్లో రోడ్ నిర్మాణానికి అటవీ శాఖ ధృవీకరణ తప్పని సరి. ఈ మేరకు ట్రిపుల్ఆర్ అధికారులు ఈ భూమిని గుర్తించి ధృవీకరణ ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖ అధికారులను కోరారు. దరఖాస్తును పరిశీలించిన అటవీశాఖ అధికారులు ఈ భూమిని ధృవీకరిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు పీసీసీఎఫ్ దీనికి సంబంధించిన ఫైల్పై సంతకంచేశారు.
ఈ భూమిని గుర్తిస్తూ రాష్ట్ర అటవీశాఖ ఇచ్చిన ధృవీకరణతో కేంద్ర అటవీశాఖ పోర్టల్లో దరఖాస్తు చేయనున్నారు. కేంద్ర అటవీశాఖ పోర్టల్లో వచ్చిన దరఖాస్తును ఢిల్లీలోని అధికారులు పరిశీలించి అనుమతి ఇస్తారు. ఆ తరువాత క్షేత్ర స్థాయిలో అటవీశాఖ అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తారు. ఆ మేరకు గ్రీన్ కవర్ మరో చోట పెంచడానికి వీలుగా జాతీయ రహదారుల సంస్థ అటవీశాఖకు డిపాజిట్ చేస్తుంది. ఆ తరువాత భూమిని స్వాధీనం చేసుకొని నిర్మాణ పనులు కొనసాగిస్తుంది.