హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని జూన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హుస్సేన్సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అమరవీరుల స్మారకచిహ్నం నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులకు, నిర్మాణ సంస్థలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సకల హంగులతో స్మారకాన్ని నిర్మించామని తెలిపారు.
ప్రపంచంలో స్టెయిన్లెస్స్టీల్తో నిర్మించిన అరుదైన అతిపెద్ద కట్టడం ఇదేనని చెప్పారు. దీనిని ప్రపంచమే అబ్బురపడి చూస్తుందని పేర్కొన్నారు. స్మారక ప్రాంగణానికి వచ్చినవారంతా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకునేవిధంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఇది యావత్ తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే కట్టడమని, మనసుపెట్టి ఫినిషింగ్ పనులు పూర్తిచేయాలని అధికారులను, వర్ ఏజెన్సీని కోరారు. ల్యాండ్సేప్ ఏరియాలో పచ్చదనానికి ప్రాముఖ్యం ఇవ్వాలని, పూల మొకలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు తగ్గట్టుగా మానవ వనరులను పెంచాలని సూచించారు.