వేల్పూర్/భీమ్గల్, మార్చి 25: ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో కొనసాగుతున్న ప్యాకేజీ 21 ద్వారా సాగునీరందించే పనుల పురోగతిని మంత్రి శనివారం పరిశీలించారు. సుమారు రూ.1,650 కోట్ల వ్యయంతో 71 వేల ఎకరాలకు కాళేశ్వరం జలాలు అందనున్నాయని వివరించారు.