హైదరాబాద్ : ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. అదే విదంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రారంభం కంటే ముందే కాంట్రాక్ట్ అధ్యాపకుల బదిలీలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విన్నవించారు.