Srisailam | ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నుండి డ్యాం ఐదు గేట్ 10 అడుగుల మేర తెరిచి దిగువన నాగార్జున సాగర్కు నీరు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,936, సుంకేశుల నుండి 33,656 క్యుసెక్కుల నీరు విడుదలైంది.
మంగళవారం సాయంత్రం వరకు రిజర్వాయర్కు 2,05,624 క్యుసెక్కుల నీరు ఇన్ఫ్లోగా నమోదైంది. ఈ నేపథ్యంలో అదే విధంగా ఐదో గేట్ వద్ద 1,39,915, కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30,839 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వలు 215 టీఏంసీలు కాగా, ప్రస్తుతం 884.80అడుగుల 214.60 టీఏంసీలుగా ఉన్నాయి.