జగిత్యాల : బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జగిత్యాల పట్టణ 10వ వార్డు లింగంపేటకు చెందిన కాంగ్రెస్ బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందన్నారు.
పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎంకేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు తాము ఆకర్షితులమై అభివృద్ధిలో భాగస్వాములము కావడానికి బీఆర్ఎస్లో చేరామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ని అధిక మెజారిటీతో గెలిపించేందుకు కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ భారతి రాజయ్య, యూత్ నాయకుడు దామోదర్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ నరసయ్య, నాయకులు చిరంజీవి, రమేష్, శ్రీనివాస్, ప్రవీణ్, దేవేందర్, ద్యగల వెంకటి, నారాయణ, ధర్మయ్య, కోటేశ్వర రావు, భిక్షపతి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.