హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 9 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. మరో 13 మంది అధికారులను వెయిటింగ్లో ఉంచి, రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఇందులో ఏడుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు.