హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మీదుగా గుల్బర్గాకు వెళ్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్టులో కాసేపు ఆగారు. టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, సీఎం రేవంత్రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్రావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ ఖర్గేను కలిశారు.
తెలంగాణలో రాజకీయాలు, పార్టీ పరిస్థితి, ఎస్ఐఆర్ సహా పలు కీలక అంశాలపై చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ క్యాడర్ బలోపేతం, ప్రభుత్వం-పార్టీ మధ్య సమన్వయం, క్యాబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల్లో మార్పుపై చర్చించినట్టు తెలిసింది. జూన్ రెండో వా రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నట్టు తెలిపాయి. ఖర్గేతో మ హేశ్కుమార్ గౌడ్ 15 నిమిషాలు సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకున్నది.