హైదరాబాద్, అక్టోబర్11 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి సర్కారు మరో వెయ్యి కోట్ల రుణం కావాలని ఆర్బీఐకి ప్రతిపాదించింది. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ మొత్తం తీసుకుంటామని ఇండెం ట్ పెట్టింది. ఓపెన్ మార్కెట్ కింద ప్రభుత్వ సెక్యూరిటీలు పెట్టి 26 ఏండ్ల కాలానికి రూ.1,000 కోట్లు తీసుకుంటామని తెలంగాణ ఆర్థికశాఖ ఇండెంట్ పెట్టినట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఇప్పటికే ఈ ఏడాది ఒక్క ఆర్బీఐ నుంచే రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల రుణ సమీకరణ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల కింద రూ.54,009 కోట్లు తీసుకుంటామని బడ్జెట్లో ప్రతిపాదించా రు. కానీ, రెండు త్రైమాసికాల్లోనే రూ.49,900 కోట్ల అప్పు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అదనపు రుణ సమీకరణ కోసం మూడో త్రైమాసికం కింద తమకు రూ.9,600 కోట్లకు ప్రతిపాదనలు పంపించినట్టు ఆర్బీఐ క్యూ-3 క్యాలెండర్లో ప్రకటించింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో…ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు
మూడో త్రైమాసికం అక్టోబర్ 14న రూ.1000 కోట్లు
మొత్తం రూ.50,900 కోట్లు
రెండో త్రైమాసికం