హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : రంజాన్ అంటే ఆత్మశుద్ధి చేసుకొనే సమయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. ఈ పర్వదినాన్ని సోదరభావంతో జరుపుకోవాలని కోరారు. అందరం కలిసిమెలిసి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అధిక ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరుఫున ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు రేవంత్రెడ్డి హాజరయ్యారు.
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మంత్రి అజారుద్దీన్తో పాటు మతపెద్దలతో కలిసి విందారగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్న వ్యక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చామని, బాక్సర్ నిఖత్ జరీన్కు రూ.2 కోట్ల ప్రోత్సాహకం అందజేశామని, క్రికెటర్ సిరాజ్కు డీఎస్పీ ఉద్యోగమిచ్చామని చెప్పారు.