హైదరాబాద్: రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతన్న వేళ ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. రాష్ట్రంలో డిమాండ్కు సరిపోయినంతగా విద్యుత్ సరఫరా అవుతుందని కాంగ్రెస్ సర్కార్ చెబుతున్నప్పటికీ కరెంటు కోతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
ప్రజలంతా ఇన్వర్టర్లు, చార్జింగ్ బల్బులు, క్యాండిళ్లు, జనరేటర్లు, పవర్ బ్యంకులు, టార్చిలైట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇవే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది బీఆర్ ప్రభుత్వం కాదని.. కాంగ్రెస్ సర్కార్ అని గుర్తుంచుకోవాలన్నారు. మే 13న ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు.
Request all fellow citizens to stock up on the following products
Six Guarantees 😄
1. Inverter
2. Charging bulbs
3. Torch lights
4. Candles
5. Generators
6. Power BanksRemember it’s the Congress Govt, Not BRS’
Vote wisely on 13th May 🙏#Vote4Car #KCRForTelangana
— KTR (@KTRBRS) May 9, 2024