KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. సైఫాబాద్ పోలీసు స్టేషన్లో కేటీఆర్పై నమోదు అయిన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది.
రాజకీయ కక్షల కారణంగానే కేసు నమోదు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకే కేసు నమోదు చేసినట్లు పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. ఎలాంటి అనుమతి లేకుండా అమరవీరుల స్మారకం వద్ద గోరెటి వెంకన్నను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారని, అందులో బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరేలా అంశాలు ఉన్నాయని వాదించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్లు కేసుకు సరిపోలడం లేదని వారం క్రితం కోర్టు వ్యాఖ్యానించింది. ఇవాళ ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం.. కేటీఆర్, గోరెటి వెంకన్నపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది కోర్టు.