ఢిల్లీ ,మే 17: తయారీ రంగంలో మొట్టమొదటి పారిశ్రామిక బీ2బీ వాణిజ్య వేదికగా నిలువడం ద్వారా మోగ్లిక్స్ అతి ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నది. ఈ కంపెనీ ఇప్పుడు ఒక బిలియన్ డాలర్ల కంపెనీగా తమ తాజా 120 మిలియన్ డాలర్ల సిరీస్ ఈ ఫండింగ్ రౌండ్ తరువాత నిలిచింది. ఈ తాజా పెట్టుబడులకు ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్ , హార్వార్డ్ మేనేజ్మెంట్ కంపెనీ (హెచ్ఎంసీ)లు నేతృత్వం వహించాయి. ఈ దశ ఫండింగ్లో తమ ప్రస్తుత మదుపరులు, టైగర్ గ్లోబల్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా , వెంచర్ హైవేలు సైతం పాల్గొన్నాయి.
భారతదేశంలో పారిశ్రామిక , ఎంఆర్ఓ ప్రొక్యూర్మెంట్ విభాగంలో స్పష్టమైన ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్తో అతిపెద్ద, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బీ2బీ వాణిజ్య వేదికగా మోగ్లిక్స్ నిలిచింది. ఇది వినియోగదారులకు పూర్తిస్థాయి సేవలను ప్యాకేజింగ్, సరఫరా చైన్ ఫైనాన్సింగ్ , అత్యున్నతమైన ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ పరంగా అందిస్తుంది.
‘‘ భారతీయ తయారీ రంగంలో ఒడిసిపట్టని సామర్ధ్యం చేజిక్కుంచుకోగలమనే గట్టి నమ్మకంతో ఆరేండ్ల క్రితం మేము కార్యకలాపాలను ఆరంభించాం. రతన్ టాటా లాంటి మహోన్నత వ్యక్తుల నమ్మకాన్ని సైతం తాము పొందడంతో పాటుగా భారతదేశంలో ఒక ట్రిలియన్ డాలర్ల తయారీ ఆర్థిక వ్యవస్ధను సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం “అని మోగ్లిక్స్ ఫౌండర్ అండ్ సీఈవో రాహుల్ గార్డ్ అన్నారు.