మంత్రి సబితను కోరిన వర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రా్రష్ట్రంలోని కాంట్రాక్ట్ ఆచార్యుల సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరుతూ వర్సిటీ టీచర్స్ అసోసియేషన్(కాంట్రాక్ట్), తెలంగాణ స్టేట్ (యూటీఏసీటీఎస్) నేతలు బుధవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. 11 వర్సిటీల్లో పనిచేస్తున్న ఆచార్యుల సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రాజస్థాన్, పంజాబ్, పశ్చిమబెంగాల్, హిమాచల్ప్రదేశ్తోపాటు ఆంధ్రా, ఉస్మానియవర్సిటీల్లోనూ గతంలో కొంత మందిని క్రమబద్ధీకరించినట్టు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమకు కూడా పీఆర్సీ వర్తింపజేయాలని, యూజీసీ నిబంధనలకనుగుణంగా సర్వీసు ప్రకారం పదోన్నతులు కల్పించాలని, మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల టీచర్లను బడ్జెట్ కోర్సుల టీచర్లుగా, పార్ట్టైం టీచర్లను ఫుల్టైమ్ టీచర్లుగా మార్చాలని విజ్ఞప్తిచేశారు. మంత్రిని కలిసినవారిలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏ పరశురామ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బీ నిరంజన్, డాక్టర్ కరుణాకర్రావు, డాక్టర్ భూమయ్య, శివారెడ్డి తదితరులు ఉన్నారు.
కొత్త స్కూళ్లు ఏర్పాటుచేయండి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
రాష్ట్రవ్యాప్తంగా పేదల బస్తీల్లో కొత్త పాఠశాలను ఏర్పాటుచేయాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖరాశారు. బడ్జెట్లో పాఠశాలల అభివృద్ధికి రూ.4 వేల కోట్లతో కొత్త పథకాన్ని ప్రతిపాదించడాన్ని స్వాగతించిన ఆయన, నిధులను ప్రాథమిక విద్య బలోపేతానికి ఖర్చుచేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
మాసాయిపేటను ముద్దాడనున్న గోదావరి
అంతర్జాతీయ జర్నల్లో మన పోలీస్ ఆర్టికల్
లైంగిక దాడి కేసులో నిందితుడి ఆత్మహత్య