‘డిజిటల్ ఎవిడెన్స్ ఫర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్’పై సైబర్క్రైం ఇన్స్పెక్టర్ నాగేందర్రావు వ్యాసం
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల దర్యాప్తులో ఉపయోగపడే అనేక అంశాలపై తెలంగాణ పోలీస్ అధికారి రాసిన వ్యాసానికి అంతర్జాతీయ జర్నల్లో చోటుదక్కింది. డీజీపీ కార్యాలయంలోని ఐటీ సెల్లో సైబర్ క్రైం వర్టికల్ ఇంచార్జిగా ఉన్న ఇన్స్పెక్టర్ కొప్పోలు నాగేందర్రావుకు ఈ గౌరవం లభించింది. ‘రోల్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ విండోస్ కీ ఆర్టిఫ్యాక్ట్స్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఎవిడెన్స్ ఫర్ ఇన్వెస్టిగేషన్ పర్సస్’ అంశంపై నాగేందర్రావు రాసిన ఐదు పేజీల ఆర్టికల్ను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ నెల 5న ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 శాతం మంది మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంనే కంప్యూటర్లలో వినియోగిస్తుంటారు. ఏదైనా సైబర్ నేరం జరిగినప్పుడు దర్యాప్తు అధికారి ఆ మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం నుంచి ఆధారాల సేకరణలో ఎలా వ్యవహరించాలి, అందులోని డాటాను తిరిగి ఎక్కడినుంచి సేకరించాలన్న పలు సాంకేతిక అంశాలపై ఈ జర్నల్లో నాగేందర్రావు ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ వ్యాసంపై సైబర్ నిపుణుల నుంచి సైతం అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
మాసాయిపేటను ముద్దాడనున్న గోదావరి
లైంగిక దాడి కేసులో నిందితుడి ఆత్మహత్య
మా సర్వీసును క్రమబద్ధీకరించండి