హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలు దశాబ్ది ఉత్సవాలు చేసుకొంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కండ్లమంటగా ఉన్నదని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై బండి సంజయ్కి అంత ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొని ఉంటే నేడు సంబురాలు ఎందుకు చేసుకొంటున్నామో తెలిసి ఉండేదని ఎద్దేవా చేశారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నింట్లోనూ విఫలమైందని విమర్శించారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో బీజేపీ విధానాలు, బండి సంజయ్ తీరును ఎండగట్టారు. తెలంగాణ సాధిస్తున్న విజయాలకు కేంద్రం ఇస్తున్న అవార్డులే తార్కాణమని పేర్కొన్నారు.