హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దిలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్గా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వాల్సిందిపోయి రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని ఓ ప్రతిపక్ష నాయకురాలి మాదిరిగా మాట్లాడటం చింతించాల్సిన విషయమని పేర్కొన్నారు. గవర్నర్ తన కండ్లకు ఉన్న బీజేపీ తెరలను తొలగించుకుంటే అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు.
తెలంగాణ పల్లెలు అద్భుతంగా ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వమే అవార్డులు ఇచ్చిందని శుక్రవారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. బీజేపీ రాష్ర్టాల కంటే తెలంగాణకే ఎకువ అవార్డులు ఇచ్చిందని తెలిపారు. సీఎం కేసీఆర్ విజన్తో చేపట్టిన పల్లెప్రకృతి వనాలు అద్భుతంగా ఉన్నాయని ఇటీవల నీతి ఆయోగ్ ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ పల్లెలు అభివృద్ధి చెందకుండానే టాప్ 20లో 19 అవార్డులను కేంద్రం ఇచ్చిందా? అనే విషయంలో గవర్నర్ స్పష్టత ఇస్తే బాగుండేదన్నారు.