హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): అలీబాబా.. అరడజను దొంగల్లాగా.. రాహుల్ బాబా.. మూడు డజన్ల దొంగల కమిటీ కాంగ్రెస్ వరింగ్ కమిటీ అని రెడ్కో చైర్మన్ వై. సతీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. సాములకు కేరాఫ్ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని రేవంత్ వ్యాఖ్యను ఆయన తీవ్రంగా పరిగణించారు. రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ను ఆంధ్రాలో విలీనం చేసి, తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్రను రేవంత్ తెలుసుకోవాలని శుక్రవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆంధ్రతో కలిపి 60 ఏండ్లు తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుతిన్నది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. తెలంగాణకు భస్మాసుర హస్తం కాంగ్రెస్ పార్టేనని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్లో పుట్టి, బీజేపీతో పెరిగి, రాజకీయాలు చేసి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన రేవంత్ త్వరలోనే ఆ పార్టీని బీజేపీకి అమ్ముకుంటాడని ఆరోపించారు. తెలంగాణకు సీఎం కేసీఆరే బాహుబలి అని స్పష్టం చేశారు.