జయశంకర్ భూపాలపల్లి : సీఎం కేసీఆర్ పాలనలోనే సర్పంచులకు గుర్తింపు వచ్చిందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీఆర్ నగర్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శం అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
పల్లె , పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. సర్పంచులు బిల్లులు రాలేదని పల్లె ప్రగతిని బహిష్కరించడం ఎక్కడా జరుగలేదన్నారు.
అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ సీఆర్ నగర్ వాసులకు పట్టాలు ఇప్పిస్తానని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకరం పాల్గొన్నారు.