Centre Fine on TTD | తిరుమల తిరుపతి దేవస్ధానంపై ఆర్బీఐ రూ.4.31 కోట్ల ఫైన్ విధించింది. విదేశాల్లోని భక్తులు పంపిన పంపిన కానుకలు కారణమా.. టీటీటీకి ఎఫ్ఆర్బీఏ కాల పరిమితి ముగిసినందుకు ఆర్బీఐ ఫైన్ విధించిందా అన్న సంగతి తెలియాల్సి ఉంది. అమెరికా, ఇంగ్లాండ్, అరబ్ దేశాలు, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, మలేషియా వంటి దేశాల నుంచి శ్రీవారి భక్తులు ఈ-హుండీ ద్వారా నగదు కానుకలు బదిలీ చేస్తుంటారు. అలా బదిలీ చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతారు. ఇలా టీటీడీకి ఈ-హుండీ ద్వారా భక్తులు పంపిన నగదు కానుకలు రూ.26 కోట్లు అందాయి.
విదేశాల నుంచి శ్రీవారికి ఈ-హుండీ ద్వారా వచ్చిన నగదు కానుకల్లో 11.50 యూఎస్ డాలర్లు, రూ.5.93 కోట్ల విలువ గల మలేషియా రింగిట్స్, రూ.4.06 కోట్ల విలువ గల సింగపూర్ డాలర్లు ఉన్నాయి. ఈ మొత్తం ఎస్బీఐకి వచ్చాయి. కానీ వీటిని టీటీడీ ఖాతాలో జమ చేయకుండా మూడేండ్లుగా ఎస్బీఐ జాప్యం చేస్తూ వచ్చింది. ఈ సమస్య త్వరగా పరిష్కరించాలని కేంద్రానికి టీటీడీ లేఖ కూడా రాసింది.
ఇంతకుముందు 2019లో టీటీడీకి కేంద్ర హోంశాఖ రూ.1.14 కోట్ల అపరాధ రుసుము విధించింది. తాజాగా ఈ నెల ఐదో తేదీన కేంద్ర ఎఫ్సీఆర్ఏ విభాగం వార్షిక రిటర్న్స్లో హుండీలో కానుకలు వేసిన వారి చిరునామాలు లేవని పేర్కొంటూ టీటీడీకి లేఖ రాసిన కేంద్ర హోంశాఖ మరోమారు రూ.3.19 కోట్ల జరిమాన విధించింది. వీటిలో చాలా వరకు ఈ-హుండీ ద్వారా నగదు కానుకలు పంపిన భక్తుల వివరాలను ఆర్బీఐకి టీటీడీ అందించలేకపోయింది. ఇదే అంశంపై కేంద్రానికి టీటీడీ తెలియజేసింది. ఈ అంశం కోర్టు మెట్లెక్కింది. హుండీలో వేసిన కానుకలో టీటీడీ దేవస్థానం కార్పస్ నిధుల్లో భాగమేనని ఏపీసీహెచ్ఆర్ చట్టంలోని 111 సెక్షన్ పేర్కొంటుందని టీటీడీ వాదించింది. అందుకే ఈ-హుండీ ద్వారా విదేశాల నుంచి వచ్చిన నగదు కానుకలను చూపినట్లు తెలిపింది.
ఈ-హుండీ ద్వారా వచ్చిన నగదు కానుకలు రూ.26 కోట్లను టీటీడీ ఖాతాలో ఎస్బీఐ జమ చేయకపోగా, దానికి వడ్డీ కూడా చెల్లించలేదు. దీనిపై కేంద్రానికి విజ్ఞప్తులు పంపినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కేంద్రం కోరిన మేరకు ఈ నెల 26న మరోమారు టీటీడీ రిటర్న్స్ దాఖలు చేసింది. అయినా టీటీడీపై కేంద్రం తాజాగా రూ.3.19 కోట్ల జరిమాన విధించడం గమనార్హం. మొత్తం ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ధార్మికసంస్థగా తమకు కొంత మినహాయింపు ఇవ్వాలని ఆర్బీఐకి టీటీడీ పలుసార్లు విజ్ఞప్తి చేసింది. టీటీడీ విన్నపాన్ని ఆర్బీఐ తిరస్కరించింది. కేంద్రం విధించిన రూ.4.31 కోట్ల అపరాధ రుసుమును కేంద్రానికి టీటీడీ చెల్లించింది. 2018లో ముగిసిన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ను త్వరలో కేంద్రం పునరుద్ధరించనున్నట్లు తెలుస్తున్నది.