కరీంనగర్ కార్పొరేషన్, మే 22: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 33 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా టెండర్ పిలిచారని, ఇప్పటివరకు రెండు లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఈ టెండర్ పొడిగింపు పేరుతో 700 కోట్లు దండుకోవాలని చూస్తున్నారని, టెండర్ను పొడిగించవద్దని డి మాండ్ చేశారు.
దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేస్తామని తెలిపారు. బుధవారం ఆయన కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో మీడియా తో మాట్లాడారు. జిల్లాలో ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉన్నదని, దానిని ఎ ప్పుడు కొనుగోలు చేస్తారో? చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలుపై ఇప్పటివరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేక పోయారని దుయ్యబట్టారు.