హైదరాబాద్, జూలై 4(నమస్తే తెలంగాణ): నలభై శాతానికిపైగా అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు ఎలాంటి షరతుల్లేకుండా రేషన్కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
కుటుంబంలో ఎంత మంది ఉన్నా.. ఆ కుటుంబానికి ఆదాయ పరిమితులను మినహాయించి రేషన్కార్డు జారీ చేయనున్నారు. గతంలో దివ్యాంగులకు కూడా ఆదాయ పరిమితిని విధించారు. కానీ ఇప్పుడు దాన్ని తొలగించారు.