హైదరాబాద్: బోగస్ కార్డుల ఏరివేతకు చేపట్టిన రేషన్ కార్డుల ఈ-కేవైసీ (Ration Card E-KYC) గడువు దగ్గపడుతున్నది. మరో నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియ ముగియనున్నది. జనవరి 31తో సమయం ముగియనుండటంతో ఇంకా అప్డేట్ చేయించుకోని వారు వెంటనే పూర్తిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
చాలా పాత కార్డుల్లో చనిపోయిన వారి పేర్లు, పెండ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిన ఆడపిల్లల పేర్లు అలాగే ఉన్నాయి. దీంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయి. దీనిని అరికట్టేందుకు రాష్ట్రంలో గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా లబ్ధిదారుల నుంచి వేలిముద్రలను మళ్లీ సేకరిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు అక్కడి రేషన్ షాపుల్లో కేవైసీ పూర్తిచేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 31తో కేవైసీ ప్రక్రియ ముగియనున్నది. మరోసారి గడువు పెంచే అకాశం లేనట్లు తెలుస్తున్నది.