Rashtrapati Nilayam | హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం( Bollaram )లోని రాష్ట్రపతి నిలయం( Rashtrapati Nilayam ) సందర్శనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Droupadi Murmu ) వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయంలో నాలెడ్జ్ గ్యాలరీ, కిచెన్ టన్నెల్, విజిటర్స్ ఫెసిలిటీస్ సెంటర్స్, మెట్ల బావిని కూడా రాష్ట్రపతి ప్రారంభించారు. ఇక రాష్ట్రపతి నిలయాన్ని ఇక నుంచి అన్ని రోజుల్లో సందర్శించే అవకాశం కలిగింది. డిసెంబర్ మినహా అన్ని రోజుల్లో సందర్శకులకు అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. రాష్ట్రపతి నిలయం విశేషాలు ప్రజలు కూడా తెలుసుకోవాలన్నారు. ప్రజలు తెలుసుకోవాలనే సందర్శనకు అనుమతించామని పేర్కొన్నారు. రాష్ట్రపతి నిలయం విశేషాలు నాలెడ్జ్ గ్యాలరీలో లభిస్తాయి. తెలంగాణ సంప్రదాయ కళతో కిచెన్ టన్నెల్ పునర్నిర్మాణం జరిగిందని తెలిపారు. నా హయాంలో బట్టర్ ఫ్లై, రాక్, నక్షత్ర గార్డెన్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ద్రౌపది ముర్ము ప్రకటించారు.