Rani Rudrama | ఐదుస్థానాల్లో గెలిచేందుకు సుపారీ ఇచ్చారని సీఎం అన్నారని.. ఓటుకు ఓటు కేసులో ఎవరు సుపారి ఇచ్చారు.. ఎవరు తీసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న వ్యక్తి ఇవాళ సీఎం అయ్యారని.. అసలు సుపారీ ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసునన్నారు. సుపరిపాలన అంటేనే బీజేపీదని.. కాంగ్రెస్, బీఆర్ఎస్కు సుపారి ఇవ్వాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.
ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ చిత్ర విచిత్ర వ్యాఖ్యలు చేశారని.. జాతీయ స్థాయి రాజకీయాలపై ఆయనకు అవగాహన లేదని అర్థమవుతోందన్నారు. పాక్కు వెళ్లి పోటీ చేయాల్సిన అవసరం కాంగ్రెస్కు అవసరమని.. తమకు కాదన్నారు. నిరాశ నిస్పృహల్లో కాంగ్రెస్ ఉందని.. కాంగ్రెస్కు పాక్పై ప్రేమ బాగా పుట్టుకొస్తున్నట్లు ఉందన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రేవంత్కు పాక్ టికెట్తో పాటు పింఛన్ వచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ డీఎన్ఏ పాకిస్థాన్ అని.. నెహ్రూ నుంచి రాహుల్ వరకు అందరికీ పాక్పై ప్రేమ ఉందన్నారు. వాళ్లను పాక్కు తీసుకెళ్లాలని.. ఉన్న 40 సీట్లు కాపాడుకోవాలని.. అవి కాపాడుకుంటే కాంగ్రెస్ వాళ్లే గొప్పొళ్లు అన్నారు.
దేశ ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం రిలీజ్ చేసిన ఘనత బీజేపీదని.. సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. అధికారంలోకి వచ్చి 120 రోజులు కాలేదని.. రాహుల్ జేబు దొంగ అని చెప్పాడన్నారు. దేశంలో జీరో కరప్షన్ కోసం.. బీజేపీ ప్రయత్నిస్తోంది.. అవినీతి చేస్తే ఎవరినీ వదలబోమన్నారు. అవినీతి లెక్కల్లో.. ఓటుకు నోటు కేసు వస్తుంది కాబట్టే.. రేవంత్కు భయం మొదలైందన్నారు. అందుకే అవినీతి అంశాన్ని ఎత్తుకున్న తమపై రాజకీయం కోసం మాత్రమే ఈ అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు.