హైదరాబాద్ : రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్లో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. అక్కాచెల్లెళ్లు లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మ ముగ్గురు కలిసి కేసీఆర్కు హారతి పట్టి, రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వదించారు. సీఎం మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది. ఈ రాఖీ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.