CM KCR | హైదరాబాద్ : ప్రగతి భవన్లో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు వేదికగా ప్రగతి భవన్ నిలిచింది. రాఖీ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్కు ఆయన తోబుట్టువులు రాఖీలు కట్టారు.
అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ కలిసి కేసీఆర్కు రాఖీ కట్టి ఆశీర్వదించారు. అనంతరం తోబుట్టువులకు కేసీఆర్ పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ, తదితరులు పాల్గొన్నారు.
వీడియో