హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల(ఏఐసీసీ) ఇన్చార్జి మీనాక్షీనటరాజన్కు కాంగ్రెస్ అధిష్ఠానం రాజ్యసభ సీటు ప్రకటించింది. ఆమె సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం కల్పించింది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 7 రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. ఈ ఏడు స్థానాలకు గురువారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. కర్ణాటకలో 3 స్థానాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మరోసారి అవకాశం కల్పించగా, మరో రెండు స్థానాలకు పవన్ఖేరా, మన్సూల్ అలీఖాన్ను ఎంపిక చేసింది. రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగి, తమిళనాడు నుంచి ప్రవీణ్చక్రవర్తి, జార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝాను ప్రకటించింది.