TSPSC Paper Leak | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీలో కంప్యూటర్ హ్యాకింగ్లో కీలకంగా వ్యవహరించిన రాజశేఖర్రెడ్డి బీజేపీ కార్యకర్తే అని తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్) చైర్మన్ పాటిమీది జగన్ బు ధవారం ట్వీట్ చేశారు. ‘టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇద్దరు నిందితుల్లో ఏ2గా ఉన్న రాజశేఖర్రెడ్డి బీజేపీ కార్యకర్త. కొన్ని ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం కూడా చేశాడు. ఈ వాస్తవాన్ని తెలంగాణ బీజేపీ కాదనగలదా? పైగా.. రాజశేఖర్రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి అత్యంత స న్నిహితుడు’ అని పేర్కొన్నారు. రాజశేఖర్రెడ్డి బీజేపీ తరఫున ప్రచారం చేస్తు న్న చిత్రాలను ట్విట్టర్కు జత చేశారు.
They are the Alpha and they are the Omega
First they commit the crime, then they protest against the same crime
Just #BJP things… pic.twitter.com/VPYNAbvBuq
— Jagan Patimeedi (@JAGANBRS) March 15, 2023
జగన్ ట్వీట్ను రీ ట్వీట్ చేస్తూ మంత్రి కేటీఆర్.. బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీజేపీకి నైతికత లేదనడానికి, కనీస ప్రమాణాలు లేవని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది. తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు, అమాయక యువత జీవితాలను నాశనం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకే.. ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సమగ్రంగా దర్యాప్తు చేసి తగు న్యాయం చేయాలని తెలంగాణ డీజీపీ గారిని కోరుతున్నాను..’ అంటూ కేటీఆర్ బుధవారంలో ట్విట్టర్లో కోరారు. ‘తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వరుస ఉద్యోగ నోటిఫికేషన్లతో యువత బీజేపీకి దూరం అవుతున్నారు’ అని ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఏనుగు భరత్ ట్విట్టర్లో పేర్కొన్నారు.