Rain Update | హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): గత కొద్దిరోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాలపై ఆవర్తన ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.