హైదరాబాద్: రుతుపవనాల ఆగమనానికి ముందే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడి వానలు పడుతున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. ఖమ్మంలో వర్షానికి లోతట్లు ప్రాంతాలు నీటమునిగాయి. జిల్లా కేంద్రంలోని మయూరి కూడలి, ప్రకాశ్నగర్ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది.
మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఉదయం నుంచే వాన కురుస్తున్నది. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మార్కెట్ యార్డుల్లో నిలువ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. కురవి, డోర్నకల్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయాయి.
వరంగల్ జిల్లాలోని హన్మకొండలో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పలు కాలనీల్లో విద్యుత్ను నిలిపివేశారు. కరీంనగర్లో కూడా చిరుజల్లులు కురిశాయి.
యాదాద్రి పరిసర ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున వర్షం కురిసింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోకి వాననీరు చేసింది. అధికారులు నీటిని తొలగిస్తున్నారు. వర్షం కారణంగా స్వామివారికి సుప్రభాత సేవా కార్యక్రమంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.