హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని, దాని ప్రభావంతో నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది.