Weather Alert | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావావరణ శాఖ సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వడగండ్లతో కూడిన భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మళ్లీ అలాంటి వర్షాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నది.