వరంగల్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పర్యటన ఖరారుకాగానే వివరాలు వెల్లడిస్తామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన ఈ నెల 9 లేదా 10న ఉంటుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పోచంపల్లి ఈ ప్రకటన విడుదల చేశా రు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనపై పార్టీ అధికారికంగా ప్రకటించలేదని, వారి పర్యటన ఖరారు కాగానే తామే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరూ అయోమయానికి గురికావొద్దని సూచించారు. ఇప్పటికే పెద్ది అకాల మరణం ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులను తీవ్రంగా కలచివేసిందని, వారి కుటుంబ సభ్యులను శోక సముద్రంలో ముంచిన విషాదంపై అయోమయాన్ని సృష్టించకూడదని కోరారు.